బడ్జెట్ చర్చలు అడుగడుగునా అధికారపక్షం మరియు ప్రతిపక్షం మధ్య వాదోపవాదాలు పెచ్చు పెరగడం తో రాజి కుదర్చడం లో బిజెపి ఎమ్ ఎల్యే మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు విష్ణు కుమార్ రాజు మధ్యవర్తిత్వం చేసారు.శాసన సభలో ప్రతిపక్షనేత చాంబర్ లో జగన్ తో పట్టిసీమ పోలవరం పై మాట్లాడేందుకు ఒక్కరికే మీ పార్టీ నుంచి అవకాశం కల్పిస్తామని తొలుత చర్చించారు .
అయితే ముగ్గురు అదీ రెండు గంటల పాటు మాట్లాడుతామని పట్టుపట్టారు .ఈవిషయమై ఆరు సార్లు ఇటు స్పీకర్ అటు జగన్ చాంబర్ లకు విసిగిపోకుండా తిరిగి ఓకే అనిపించుకున్నారు.ఆ తర్వాత పట్టి సీమపై చర్చ ఆరంభమయ్యింది.







