‘ఐ’ ఇంకా అనుమానమేనా?

శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఐ’.ఈ సినిమా విడుదలకు అంతా సిద్దం అనుకుంటున్న సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

ఈ సినిమా నిర్మాత ఆస్కార్‌ రవిచంద్రన్‌ ఈ సినిమా కోసం ఎక్కడ పడితే అక్కడ భారీ ఎత్తున ఫైనాన్స్‌ తీసుకు రావడం జరిగిందట.ఆ ఫైనాన్స్‌ కట్టేందుకు నిర్మాత వద్ద ప్రస్తుతం సొమ్ము లేదు.

దాంతో డిస్ట్రిబ్యూటర్లు సాయం చేసినా కూడా ఫైనాన్సియర్‌ల బాధ తొలగలేదు.చివరకు ఈ సినిమాను ఆపేయాలంటూ ఫైనాన్సియర్‌లు కోర్టుకు వెళ్లారు.

కోర్టు స్టే కూడా విధించింది.అయితే ఎలాగోలా నిర్మాత ఆస్కార్‌ రవిచంద్రన్‌ ఫైనాన్సియర్స్‌ను డీల్‌ చేయగలిగాడు.

Advertisement

ఈ సినిమాను అనుకున్నట్లుగా ఈనెల 14న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.అంతా బాగుందనుకుంటున్న సమయంలో ఈ సినిమాపై మళ్లీ అనుమానాలు వస్తున్నాయి.

తమిళ మీడియాలో కొన్ని రకాల వార్తలు గుప్పుమంటున్నాయి.ఈ సినిమాలో హీరోగా నటించిన విక్రమ్‌, హీరోయిన్‌గా నటించిన అమీ జాక్సన్‌ మరియు దర్శకత్వం వహించిన శంకర్‌లకు ఇంకా పెద్ద మొత్తంలో పారితోషికం బాకీ ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఆ బాకీ తీర్చిన తర్వాతే సినిమా విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.కాని ప్రస్తుతం నిర్మాత ఆ పారితోషికాలను ఇచ్చే పరిస్థితిలో లేడు.

దాంతో ఈ సినిమాను ఆపేయాలని వారు డిమాండ్‌ చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.అయితే ఈ విషయాన్ని మాత్రం చిత్ర యూనిట్‌ సభ్యులు కొట్టి పారేస్తున్నారు.

భూములపై చంద్రబాబు దుష్ప్రచారం.. సీఎం జగన్ ఫైర్
Advertisement

తాజా వార్తలు