ప్రాణం తీసిన అతివేగం.. చెట్టును బైకు ఢీకొని ఇద్దరు యువకుల దుర్మరణం

హన్మాజీపేటలో పండుగ పూట రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు రాజన్న సిరిసిల్ల జిల్లా :ద్విచక్ర వాహనం చెట్టును బలంగా ఢీకొనడంతో ఇద్దరి యువకులు దుర్మరణం చెందిన విషాద సంఘటన వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.గ్రామానికి చెందిన విక్కుర్తి దిలీప్ (22) సురా అనిల్ (21) అనే ఇద్దరు స్నేహితులు గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

 Two Youths Died When Their Bike Collided With A Tree At High Speed That Took The-TeluguStop.com

అప్పటివరకు ఎంతో సంతోషంగా వున్న ఇద్దరు మిత్రులు దుర్గామాత నిమజ్జనం తర్వాత నూతనంగా కొనుగోలు చేసిన బైకుపై సరదాగా మామిడిపల్లి రహదారి వైపు వెళ్లారు.అతివేగంతో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు 108 కి సమాచారం అందించిన స్పందించకపోవడంతో అటువైపుగా పెట్రోలింగ్ కు వచ్చిన పోలీసులు క్షతగాత్రులను తమ వాహనంలోనే వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం పెద్ద ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలో ఇద్దరు యువకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు.

మృతదేహాలను సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.ఎంతో భవిష్యత్తు ఉన్న ఇద్దరి యువకులు అర్థాంతరంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రుల రోదనలతో హన్మాజీపేట గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube