మెడికల్ కాలేజ్ సీట్ల స్కాంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం

మెడికల్ కాలేజ్ సీట్ల కుంభకోణంలో ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.మెడికల్ సీట్లలో రూ.

 Ed Probe Into Medical College Seat Scam-TeluguStop.com

వంద కోట్లకు పైగా స్కామ్ జరిగినట్లు ఈడీ అభియోగిస్తుంది.ఈ నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి కుమారులకు ఈడీ నోటీసులు జారీ చేయనుందని తెలుస్తోంది.2016 నుండి 2022 వరకు మెడికల్ కాలేజ్ పీజీ అడ్మిషన్లలో గోల్ మాల్ జరిగిందని ఈడీ ఆరోపణలు చేస్తుంది.ఈ వ్యవహారంపై ఇటీవలే 16 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

మల్లారెడ్డి కాలేజీతో పాటు పలు ప్రముఖ కాలేజీలపై తనిఖీలు నిర్వహించారు.సోదాలు అనంతరం అధికారులు భారీగా నగదుతో పాటు కీలక డాక్యుమెంట్స్ ను సీజ్ చేశారు.

మల్లారెడ్డి కాలేజీ ఛైర్మన్ గా భద్రారెడ్డి, జనరల్ సెక్రటరీగా మహేందర్ రెడ్డి ఉన్న నేపథ్యంలో వీరిద్దరితో పాటు పలువురికి నోటీసులు ఇవ్వనున్నారు.వచ్చే వారం మెడికల్ కాలేజ్ యాజమాన్యాలకు ఈడీ నోటీసులు జారీ చేయనుందని తెలుస్తోంది.

అయితే ఫిబ్రవరి 2022 లో కాళోజీ యూనివర్సిటీ ఇచ్చిన ఫిర్యాదుతో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube