భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్ర జెండాలతో నిండుపోయింది.కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా గర్జన సభ జరగనుంది.
సుమారు లక్ష మంది సమీకరణ దిశగా పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు.ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే కాకుండా సభకు హాజరయ్యేందుకు ప్రత్యేక రైలు ద్వారా కార్యకర్తలు వస్తున్నారని తెలుస్తోంది.
సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులతో సీపీఐ నేతలు ఇప్పటికే సమావేశాలు నిర్వహించి సభకు రావాలని ఆహ్వానించిన సంగతి తెలిసిందే.