వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ కొనసాగుతోంది.

ఈ క్రమంలోనే భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయకూడదని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది.

భాస్కర్ రెడ్డి తరపున వాదనలు వినిపిస్తున్న లాయర్ ఉమా మహేశ్వర్ రావు ఆయన ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నారు.ఈ సందర్భంలోనే వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విషయాన్ని ప్రస్తావించారని సమాచారం.

కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని
Advertisement

తాజా వార్తలు