సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) హీరోగా పూజా హెగ్డే ( Pooja Hegd e) , శ్రీలీల ( SreeLeela ) హీరోయిన్ లుగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”SSMB28”.రెండు మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మొన్నటి వరకు శరవేగంగా షూటింగ్ జరుపుకుంది.
ముందు నుండి భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా షూటింగ్ కు తాజాగా బ్రేక్ ఇచ్చారు.

ఇక ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ రావడంతో మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్ కోసం వెళ్లారు.అతి త్వరలోనే ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కాబోతుంది.ఇదిలా ఉండగా మహేష్ బాబు మొదటిసారి పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు.
దీనిని దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ ( Trivikram ) ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్లో బాలీవుడ్ ( Bollywood) స్టార్స్ ను విలన్ పాత్రల కోసం ఎంపిక చేసుకుంటున్న విషయం తెలిసిందే.ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాల్లో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేస్తున్నాడు.అందుకే త్రివిక్రమ్ కూడా ఈ సినిమాలో మహేష్ కు పోటీగా జాన్ అబ్రహం ( John Abraham ) ను విలన్ పాత్ర కోసం ఎంపిక చేసుకోవాలని అనుకుంటున్నారట.

మరి ఈయన ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి.ఈయన కనుక ఒప్పుకుంటే ఈ సినిమా మైలేజ్ బాలీవుడ్ లో పెరిగే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇక జగపతిబాబు ( Jagapathi Babu ) నెగిటివ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్టు కూడా అనౌన్స్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు.







