తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ పై జనసేన ఫిర్యాదు చేసింది.ఈ మేరకు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అందించారు.
దర్శన టికెట్లు, గదులు కేటాయింపుల కోసం తీసుకోవాల్సిన డబ్బుల కంటే టీటీడీ అధికంగా వసూలు చేస్తోందని ఆరోపిస్తూ జనసేన నేతలు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలోనే టీటీడీ ఛైర్మన్, ఈవో కార్యాలయాలను త్వరలోనే ముట్టడిస్తామని తెలిపారు.







