టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలేనని పేర్కొన్నారు.
బందర్ కు చంద్రబాబు చేసింది ఏమిటని ప్రశ్నించారు.
జనం కోసం బ్రతికే వ్యక్తి జగన్ అని చెప్పిన మాజీమంత్రి పేర్నినాని ఆయన చేసిన అభివృద్ధి చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు అక్కసుతో అవాకులు, చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.