కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు ఆటో బ్లాస్ట్ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది.ఈ పేలుడును ఉగ్రవాదుల కుట్రగా పోలీసులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎన్ఐఏ బృందాలు రంగంలోకి దిగాయి.ఘటనా స్థలంలో అనుమానాస్పద వస్తువులను అధికారులు గుర్తించారు.
రెండు బ్యాటరీలు, నట్లు, బోల్ట్, సర్క్యూట్ వైరింగ్ ను క్లూస్ టీం గుర్తించింది.కుక్కర్ లో బాంబు అమర్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆటోలో ఓ ప్రయాణికుడు ఎక్కిన తర్వాతే పేలుడు సంభవించింది.దీంతో ప్రయాణికుడిని పోలీసులు విచారిస్తున్నారు.
అయితే గాయపడిన ప్రయాణికులు పొంతన లేని సమాధానాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.







