ఢిల్లీలో ఆప్ కౌన్సిలర్ నానా హంగామా సృష్టించాడు.ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని నిరసనకు దిగాడు.
ఈ నేపథ్యంలోనే ఆప్ కౌన్సిలర్ హజీబ్ ఉల్ హసన్ టవర్ ఎక్కి ఆందోళన వ్యక్తం చేశాడు.టికెట్ విషయం తెలిసే వరకు కిందకు దిగేది లేదని భీష్మించుకుని కూర్చొన్నాడు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.పైకి ఎక్కి కౌన్సిలర్ కు సర్దిచెప్పి కిందకు దించారు.
దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.