లోన్అప్లో అప్పు తీసుకున్నవారిని వేధిస్తున్న నలుగురిని నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు.వారి ఖాతాల్లోని రూ.1.20కోట్ల నగదును నిలిపివేయాలని బ్యాంకు అధికారులను కోరారు.నెల్లూరుకు చెందిన విద్యాసాగర్ రెడ్డి లోన్ యాప్లో రూ.30వేలు తీసుకున్నారు.తిరిగి చెల్లించినా, నిర్వాహకులు బెదిరించి రూ.40లక్షలు వసూలు చేశారు.అయినా వేధింపులు ఆపకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని అరెస్ట్ చేశారు.







