ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలో ఉన్న బీసీ గురుకుల కళాశాలను తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు, మధిర శాసనసభ్యులు, గౌ” శ్రీ.భట్టి విక్రమార్క మల్లు గారు బుధవారం పరిశీలించారు.
ముందుగా కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది కలిసి సిఎల్పీ నేత భట్టి విక్రమార్కకు గెస్ట్ ఆఫ్ హనర్ గా స్వాగతం పలికారు.భట్టి విక్రమార్క గారు కళాశాల విద్యార్థులతో మాట్లాడి అక్కడ వసతులు గురించి అడిగి తెలుసుకున్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.వంటలను వండుతున్న తీరు తెన్నులు సందర్శించి మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అంధిచాలని వారికి ఆదేశించారు.ప్రతి ఒక్కరికీ చదువుకునే అవకాశం కలిపించడమే ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అని అందుకు అనుగుణంగా మీరందరూ విద్యార్థులకు ఆ విధమైన వాతావరణం కల్పించాలని ప్రిన్సిపాల్ మరియు బోధనా సిబ్బందికి చెప్పారు.హస్టల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.







