ధనవంతులు పిల్లలు మాదిరిగానే పేద పిల్లలు ఉన్నత చదువులు చదవాలి: సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తుతం కడప జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలలో జగన్ పాల్గొన్నారు.

ఈ పర్యటనలో భాగంగా వేంపల్లి లో నూతనంగా నిర్మించిన రెండు జిల్లా పరిషత్ పాఠశాలలను ప్రారంభించారు.₹15 కోట్ల రూపాయలతో బాలురు మరియు బాలికల ఉన్నత పాఠశాలలను నిర్మించడం జరిగింది.ఈ సందర్భంగా పాఠశాలలను ప్రారంభించి సీఎం జగన్ తనదైన శైలిలో ప్రసంగించారు.

రాష్ట్రవ్యాప్తంగా నాడు నేడుకార్యక్రమం ద్వారా పాఠశాలల రూప రేఖలు మారాయి అని తెలిపారు.చదువుపై ఇంత దృష్టి పెట్టడానికి గల కారణం ధనవంతులు పిల్లలు మాదిరిగానే పేదవాళ్ల పిల్లలు కూడా ఉన్నత చదువులు చదవాలన్నదే నా ఉద్దేశమని .గొప్పగా ఇంగ్లీష్ మాట్లాడాలని తెలిపారు.రాబోయే రోజుల్లో పిల్లలకు మరింత మంచి చేసే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని జగన్ ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇంగ్లీష్ లో మాట్లాడి సీఎం జగన్ పిల్లలకు చేస్తున్న పలు మంచి పనులు.వివరిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు