మెగా హీరోయిన్ తో జై బాలయ్య అనిపించిన నందమూరి ఫ్యాన్స్..!

కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట డైరక్షన్ లో వస్తున్న సినిమా బింబిసారా.ఈ సినిమాకు సంబందించిన టీజర్ రిలీజ్ సోమవారం ఏం.

ఎం.బి సినిమాస్ లో జరిగింది.బింబిసారా టీజర్ కు అనూహ్యమైన స్పందన వచ్చింది.

ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో ఆ సినిమాలో నటించిన హీరోయిన్ మళయాళ భామ సంయుక్త మీనన్ కి నందమూరి ఫ్యాన్స్ షాక్ తగిలింది.మళయాళంలో సూపర్ ఫాం లో ఉన్న ఈ అమ్మడు తెలుగులో మొదట సైన్ చేసిన సినిమా బింబిసారా.

అయితే ఆ సినిమా కన్నా ముందే భీమ్లా నాయక్ సినిమాలో నటించింది.భీమ్లా నాయక్ సినిమాలో రానాకి జోడీగా నటించింది సంయుక్త మీనన్.ఆ సినిమాలో అమ్మడి నటనకు తెలుగు ఆడియెన్స్ మంచి మార్కులు వేశారు.

అంతేకాదు త్రివిక్రం దృష్టిలో పడటంతో సంయుక్త మీనన్ కు వరుస అవకాశాలు ఇప్పించే ఏర్పాటు చేస్తున్నారట.ముందు పవర్ స్టార్ తో సినిమా చేయడం వల్ల ఆమెకు మెగా హీరోయిన్ అనే ముద్ర పడ్డది.

Advertisement

అంతేకాదు ఆ తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.

అందుకే సంయుక్త మీనన్ చేత జై బాలయ్య అనిపించారు నందమూరి ఫ్యాన్స్.బింబిసార టీజర్ రిలీజ్ ఈవెంట్ లో ఆమె మాట్లాడుతుంటే నందమూరి ఫ్యాన్స్ జై బాలయ్య అనాలని కోరారు.వారి కోరిక మేరకు ఆమె జై బాలయ్య అనేసింది.ఆ తర్వాత జై ఎన్.టి.ఆర్ అని కూడా అనమన్నారు.ఆమె జై ఎన్.టి.ఆర్, జై కళ్యాణ్ రామ్ అని అన్నారు.అలా మెగా హీరోయిన్ గా తెలుగు పరిశ్రమకు వచ్చిన సంయుక్త మీనన్ చేత నందమూరి ఫ్యాన్స్ జై బాలయ్య అనిపించారు.

బింబిసారా సినిమా టీజర్ ఆడియెన్స్ ని ఇంప్రెస్ చేసింది.తప్పకుండా సినిమా కళ్యాణ్ రామ్ కెరియర్ లో ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని చెప్పొచ్చు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు