కుప్పం నియోజకవర్గానికి బయలుదేరిన చంద్రబాబు..!!

టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ఏపీలో వరుస పెట్టి పర్యటనలు చేపడుతున్న సంగతి తెలిసిందే.

"బాదుడే బాదుడు" అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల టీడీపీ చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు తాజాగా మూడు రోజుల పాటు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు.

బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు బయలుదేరిన చంద్రబాబు అక్కడి నుండి రోడ్డు మార్గం మీదుగా కుప్పం కి చేరుకోనున్నారు.

ఈ క్రమంలో విద్యుత్ చార్జీలతో పాటు ఆర్టీసీ చార్జీలు పెంచడం పై కుప్పం నియోజకవర్గంలో బాదుడే బాదుడు అనే నిరసన కార్యక్రమంలో పాలుపంచుకునీ ఆ తర్వాత స్థానిక నేతలతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం కానున్నట్లు సమాచారం.పర్యటనలో కుప్పంలో.శాంతిపురం, గుడిపల్లె మండలాలలో చంద్రబాబు పర్యటించనున్నారు.

Advertisement

 కుప్పం తర్వాత .కోస్తాంధ్ర జిల్లాల బైకు కూడా బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనటానికి రెడీ అవుతున్నట్లు.పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?
Advertisement

తాజా వార్తలు