చివరి వరకు అంటూ ఆట సందీప్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్.. ఏం జరిగిందంటే?

తెలుగు సినీ ప్రేక్షకులకు డాన్స్ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఆట సందీప్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నాడు.

ఆట సందీప్ మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమాని అన్న విషయం తెలిసిందే.మెగాస్టార్ చిరంజీవి పాటలకు సందీప్ స్టెప్పులను ఇరగదీస్తు ఉంటాడు.

ఇంకా చెప్పాలి అంటే లాభం సమయంలో తన భార్య జ్యోతి తో కలసి కొన్ని వందల డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.వీరిద్దరూ కలిసి మాస్ స్టెప్పులు వేస్తూ డాన్స్ ని ఇరగదీస్తు ఉంటారు.

అంతేకాకుండా కరోనా సమయంలోఎంతో మందికి నిత్యావసర సరుకులు కూడా అందజేశారు.ఇదిలా ఉంటే తాజాగా సందీప్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.

Advertisement

తన భార్య జ్యోతి ఒక వృద్ధాశ్రమాన్ని సందర్శించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.అమ్మానాన్నల గురించి ఎంత గొప్పగా చెప్పి వారిని చివరి వరకు మనం ప్రాణంగా చూసుకోవాలి అని చెబుతూ ఎమోషనల్ గా పోస్ట్ చేశాడు.

అమ్మ ప్రేమ కన్నా గొప్పది ఏది లేదు.అమ్మ ప్రేమ అంతులేని ఆకాశం,భూమి కన్నా ఎక్కువ.

వారిని ఒక వయసుకి వచ్చాక జాగ్రత్తగా చూసుకోవాలి.ఒక ఫౌండేషన్ హోమ్ లో ఎంతో మంది అమ్మలను కలిసి వాళ్లతో సరదాగా సమయం పంచుకుంది జ్యోతి.

వాళ్ల సంతోషానికి అవధులు లేవు.అందుకు సంబంధించిన వీడియోని సందీప్ సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియో కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ ఎమోషనల్ వీడియోకి చాలా మంది కనెక్ట్ అవుతున్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

లక్ష్మి అనే అమ్మాయి సుభాజ ఫౌండేషన్ నడుపుతూ ఎంతో మంది కి సహాయం చేస్తుంది.చెల్లమ్మ నీ చల్లని మనసుకి నా పాదాభి వందనాలు.

Advertisement

ఇలా ఇంకా ఎంతో మందికి నీ సహాయం ఉండాలి.చివరగా ఒక్క మాట.మన తల్లీ,తండ్రి ఇద్దరు మనకి రెండు కళ్ళు లాంటి వారు.వారిని చివరి వరుకు మనం ప్రాణంగా చూసుకోవాలి.

వీలయినంతలో నలుగురుకి సహాయం చేదాం అని తన పోస్ట్ లో పేర్కొన్నాడు సందీప్.

తాజా వార్తలు