'ఆచార్య' ప్రీ రిలీజ్ వేడుక చీఫ్ గెస్ట్ గా సీఎం జగన్..??

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, చరణ్ కలిసి నటించిన సినిమా "ఆచార్య".ఏప్రిల్ 29వ తారీకు ఈ సినిమా విడుదల కానుంది.

ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ చేయడంతో.అభిమానుల నుండి భారీ ఎత్తున రెస్పాన్స్ వచ్చింది.

దీంతో రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసే ఆలోచనలో నిర్మాత చరణ్ సరికొత్త ప్లాన్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే "ఆచార్య" ప్రీ రిలీజ్ వేడుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో సిద్ధార్థ కాలేజీ ప్రాంగణం నందు జరగనున్నట్లు సమాచారం.

అయితే ఈ వేడుకకు సీఎం జగన్ ని చిరంజీవి ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఏప్రిల్ 23 వ తారీకు "ఆచార్య" ప్రీ రిలీజ్ వేడుక జరగనుందట.

Advertisement

సినిమా ఇండస్ట్రీకి సంబంధించి టికెట్ల విషయంలో పాజిటివ్ గా జగన్ రియాక్ట్ కావటం మాత్రమే కాక చిరంజీవి చెప్పిన సూచనలను పరిగణలోకి తీసుకుని కొత్త జీవోలు విడుదల చేయడంతో.టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు ఈ వేడుకలో సీఎం వై.ఎస్.జగన్ నీ సన్మానించనున్నట్లు సమాచారం.

పైగా అతి పెద్ద భారీ బడ్జెట్ సినిమా "ఆర్ఆర్ఆర్" విషయంలో జగన్ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించింది.దీంతో చరణ్. రాజమౌళి "ఆర్ఆర్ఆర్" టీం కూడా జగన్ కి కృతజ్ఞతలు తెలపడానికి హాజరు కానున్నట్లు టాక్.

ఇక ఇదే వేదికపై సినిమా ఇండస్ట్రీ నుద్దేశించి వైయస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఏది ఏమైనా "ఆచార్య" ప్రీ రిలీజ్ వేడుకకు వైఎస్ జగన్.

ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు వస్తున్న వార్తలు అటు రాజకీయ రంగంలో ఇటు సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు