రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారు.. గ్రాండ్ ఈవెంట్ ఎక్కడంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రాధేశ్యామ్.

ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

రోమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇటలీ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథ.ఈ ప్రేమ కథకు అద్బుతమైన గ్రాఫిక్స్ యాడ్ చేసి ఈ సినిమాను రాధాకృష్ణ తెరకెక్కించాడు.ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.

విడుదల తేదీ కూడా దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచేశారు చిత్ర యూనిట్.ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పాటలు, పోస్టర్స్, టీజర్ వంటివి వదిలారు.

వీటితో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం డేట్ ఫిక్స్ చేసినట్టు సమాచారం.

Advertisement

డిసెంబర్ 23న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చేయడానికి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఈ ఈవెంట్ ను ఎంతో గ్రాండ్ గా నిర్వహించనున్నట్టు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు టాక్.ఇక ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా ఎవరు రాబోతున్నారు.

అసలు గెస్టులను పిలుస్తారా లేదా అనే విషయం ఇంకా బయటకు రాలేదు.

ఈ సినిమాను యువీ క్రియేషన్స్, టీ సిరీస్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.తెలుగుతో పాటు మొత్తం 7 భాషల్లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించారు.

ఈ సినిమాలో ప్రభాస్, పూజా మధ్య రోమాన్స్ అద్భుతంగా వచ్చిందని చిత్ర యూనిట్ చెప్పడంతో ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడానని వెయిట్ చేస్తున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు