పిక్‌ టాక్ : శ్రీవల్లి డీ గ్లామర్ గాను పిచ్చెక్కిస్తోంది

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్‌ 1 సినిమా లో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటించింది.

సినిమా లో ఆమె డీ గ్లామర్‌ రోల్‌ లో కనిపించబోతుంది.

ఇంతకు ముందు తన చేతికి నల్లటి మేకప్ వేసుకున్న ఫొటోను షేర్‌ చేసింది.లంచ్ సమయంలో ఆ మేకప్ తొలగించిన సమయంలో ఎలా ఉంది అనేది కూడా ఆమె ఫొటోను షేర్‌ చేసింది.

సాదారణంగా అయితే డీ గ్లామర్‌ గా బ్లాక్‌ గా కనిపిస్తే ఏమాత్రం ఆకట్టుకునే విధంగా ఉండరు.అసలు హీరోయిన్ లను అలా చూసేందుకు ఏ ఒక్కరు ఇష్టపడరు.

కాని సుకుమార్‌ తన సినిమా లో హీరోయిన్‌ ను డీ గ్లామర్‌ గా చూపిస్తూనే కాస్త హాట్ గా చూపించే ప్రయత్నం చేశాడు .అంటే పల్లెటూరు లో అమ్మాయిలు బ్లాక్ ఉండటంతో పాటు అందంగా ఉంటారు అనే విషయాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాడు.

Advertisement

ఇక రష్మిక ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుంది.ఆమె పాత్ర మరియు ఆమె లుక్ చాలా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు.మరో రెండు రోజుల్లో ఈ సినిమా ట్రైలర్‌ ను విడుదల చేయబోతున్నారు.

పుష్పకు జోడీగా శ్రీవల్లిగా కనిపించబోతున్న రష్మిక లుక్ ఇప్పటికే రివీల్‌ అయ్యింది.ట్రైలర్ టీజ్ ను విడుదల చేశారు.

అందులో ఇలా శ్రీవల్లి కనిపించింది.పూర్తి ట్రైలర్ లో ఎలా ఉంటుందా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

రెండు మూడు సెకన్లు మాత్రమే టీజ్ లో కనిపించిన షాట్ ను రష్మిక మందన్నా స్క్రీన్ షాట్‌ ను తీయడం జరిగింది.స్క్రీన్ షాట్‌ లో శ్రీవల్లిగా రష్మిక ఆకట్టుకునే విధంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

బండి మీద మరో ఇద్దరు అమ్మాయిలను ఎక్కించుకుని అలా చెరువు నుండి స్నానం చేసి కళ్లద్దాలు పెట్టుకుని అలా వెళ్తున్నారు.ఈ ఫొటో చూసి శ్రీవల్లి డీ గ్లామర్ గా కూడా పిచ్చెక్కిస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు