పునీత్ రాజ్ కుమార్ భార్య ఎమోషనల్ పోస్ట్.. నెట్టింట్లో వైరల్?

కన్నడ పవర్ స్టార్ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈయన గత నెల 29వ తేదీన కార్డియాక్ అరెస్ట్ తో మరణించడం యావత్ సినీ పరిశ్రమలో కృంగదీసింది.

ఇప్పటికీ ఈయన మరణం నుంచి అతని కుటుంబ సభ్యులు అతని అభిమానులు బయటపడలేక పోతున్నారు.ఇదిలా ఉండగా పునీత్ భార్య అశ్విని గురించి మనకు తెలిసిందే.

పునీత్ ప్రతి పనిలోనూ ఆమె అతనిని ప్రోత్సహిస్తూ అతని వెన్నంటే ఉండేది.తాజాగా పునీత్ భార్య అశ్విని సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.తాజాగా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన అశ్విని ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.

Advertisement

శ్రీ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం కేవలం మా కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా కన్నడ సినీ ప్రేక్షకులకు కూడా ఎంతో షాకింగ్ గా ఉంది.ఆయనని ఒక పవర్ స్టార్ గా చేసిన కన్నడ సినీ ప్రేక్షకులకు ఆయన లేని లోటు ఊహించుకోవడం ఎంతో కష్టతరంగా ఉంటుంది.

మీ బాధలు మీరు ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు చోటు ఇవ్వకుండా గౌరవంగా ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారని కేవలం భారత దేశంలో మాత్రమే కాకుండా విదేశాల నుంచి ఆయన అభిమానులు ఆయన మృతికి సంతాపం తెలిపారని ఈ సందర్భంగా తెలియజేశారు.

అప్పుని అభిమాన నటుడిగా భావించి ఆయనను వేలాదిమంది అనుసరిస్తూ అతని మాదిరిగానే నేత్రదానం చేయడానికి ఎంతో మంది ముందుకు వచ్చారు.ఇలా మీరు చేస్తున్న మంచి పనులలో ఆయన ఎప్పుడు జీవించే ఉంటారని మీ ప్రేమ మద్దతు కోసం మా కుటుంబం తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను అంటూ ఈ సందర్భంగా అశ్విని పునీత్ రాజ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు