వరుసగా ఆ సినిమాలు తియ్యడమే ఛార్మికి 'హీరోయిన్'గా మైనెస్ అయ్యిందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన నటి ఛార్మి గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తన అందంతో మాత్రం ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.ఇక సినిమాలలో హీరోయిన్ గా పాత్ర ముగించుకొని ప్రస్తుతం నిర్మాతగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

ఇక ఈమె హీరోయిన్ గా మైనస్ కావడానికి కారణం తాను నటించిన సినిమాలే అని తెలిసింది.ఇంతకు ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

ఛార్మి తెలుగు సినీ ఇండస్ట్రీకి చిన్న వయసులోనే హీరోయిన్ గా అడుగుపెట్టింది.అది కూడా 2001లో నీ తోడు కావాలి అనే సినిమాతో పరిచయమైంది.

Advertisement

కానీ ఈ సినిమా అంతా సక్సెస్ కాలేకపోయింది.ఆ తర్వాత శ్రీ ఆంజనేయం సినిమాలో నటించింది.

ఈ సినిమాలో తన అందాలను కూడా ఆరబోసింది.ఈ సినిమాతో మంచి హిట్ అందుకుంది.

ఆ తర్వాత మాస్, చక్రం, పౌర్ణమి, రాఖి, జ్యోతిలక్ష్మి, మంత్ర వంటి పలు సినిమాలలో నటించి మంచి హిట్ ను అందుకుంది.

ఇక జ్యోతిలక్ష్మి సినిమా తర్వాత సినిమాలకు దూరం అయింది.అది కూడా హీరోయిన్ గా మాత్రమే.జ్యోతిలక్ష్మి సినిమా సమయంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో పరిచయం ఏర్పడింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

దాంతో తను ఆయన సహాయంతో నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది.అలా పూరి జగన్నాథ్ రూపొందించే ప్రతి ఒక్క సినిమాలకు తానే నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది.

Advertisement

గతంలో వీరిద్దరి సన్నిహితం చూసి టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా గుసగుసలు కూడా వినిపించాయి.

కానీ వీరి మధ్య ఎటువంటి రిలేషన్ లేదని తామే స్వయంగా తెలిపారు.నిజానికి ఈ అమ్మడికి జ్యోతిలక్ష్మి సినిమా తర్వాత ఏ సినిమాలో కూడా అవకాశాలు రాలేదు.అలా రాకపోవడానికి కారణం మరొకటుంది.

అది ఏంటో కాదు తాను వరుసగా నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలే కారణమని తెలుస్తుంది.తాను మంత్ర, మంగళ వంటి సినిమాలలో లేడీ ఓరియెంటెడ్ పాత్రలతో ముందుకు రాగా ఆ తర్వాత ఛార్మిను హీరోయిన్ గా చూడటానికి ప్రేక్షకులు కూడా ఇష్టపడలేదు.

దీంతో తాను హీరోయిన్ గా అవకాశాలు కోల్పోయింది.

అలా హీరోయిన్ గా కాకుండా నిర్మాతగా బాగా సంపాదిస్తుంది ఛార్మి.ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా లైగర్.ఇక ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు కూడా ఛార్మినే నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉంది.ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రూపొందనుండగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇక ఛార్మి సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.

అంతేకాకుండా సినిమా అప్ డేట్ లను కూడా బాగా షేర్ చేస్తుంది.

తాజా వార్తలు