హుజురాబాద్ లో దళిత బంధు అమలును బీజేపీనే అడ్డుకుందని టిఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు.
దళిత బందు అమలుపై సీఎం కేసీఆర్కు చిత్తశుద్ధి లేదని దీనిపై ఆయనతో చర్చించేందుకు తాను సిద్ధమని దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి యాదాద్రి పర్యటనకు బయలుదేరి వెళ్లారు.అక్కడ ఆయన ఆలయ పునః నిర్మాణ పనుల్లో
టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి దమ్ముంటే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ తెచ్చుకోవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు.
ఇంటర్ ప్రథమ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులకు థియరీ పరీక్షలు ఈ నెల 25 నుంచి నవంబర్ 3 వరకు జరగనున్నాయి అని ఇంటర్మీడియెట్ విద్యా మండలి కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు.దీనికి సంబంధించిన హాల్ టికెట్లు ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.
హైదరాబాద్ నగరంలోని బోయిన్ పల్లి లో సంచలనం సృష్టించిన కిడ్నాప్ కేసు దర్యాప్తును పోలీసులు పూర్తి చేశారు.
తెలంగాణలో ఇంజినీరింగ్ , టెక్నాలజీ, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పేజీఈ సెట్ 2021 ద్వారా కాలేజీలో చేరేందుకు అభ్యర్థులు సర్టిఫికెట్లను అప్లోడ్ చేసుకునేందుకు గడువును ఈనెల 25 వరకు పొడిగించారు.
ప్రధాని నరేంద్ర మోడీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.బిసి జనగణన చేపట్టాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
వైయస్సార్సీపి అధినేత్రి షర్మిల మంగళవారం ఇడుపులపాయకు చేరుకున్నారు.
ఎయిడెడ్ ఉపాధ్యాయులను ప్రభుత్వ పాఠశాలల్లోని ఖాళీల్లో నియమించి విలీన ప్రక్రియను ముగించేందుకు ఏపీ ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది.
దళిత బంధు పథకం బిజెపి కారణంగానే నిలిచిపోయిందని టీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది అని బిజెపి నేత ప్రేమేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ మేరకు ఈ నెల 7 న కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖను విడుదల చేశారు.
దళిత బంధు పథకం నిలిచిపోవడానికి బిజెపి కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖ కారణం అని ఆరోపిస్తూ దళిత సంఘాల నేతలు అనేక చోట్ల ఈటెల రాజేందర్ దిష్టిబొమ్మ లను దహనం చేశారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టిక్కెట్లు కేటాయిస్తానని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించారు.
ఈ నెల 23 24 తేదీల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ లో పర్యటించనున్నారు.
మాదకద్రవ్యాల కేసులో ముంబై లోని ఆర్థర్ రోడ్డు జైలులో బెయిల్ కోసం ఎదురుచూస్తున్న బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు ఎన్ సీబీ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు.
బీజేపీ నేత బాబుల్ సుప్రీయో మంగళవారం లాంఛనంగా తన ఎంపీ పదవికి రాజీనామ చేశారు.
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ 17 వ వర్ధంతి ని తమిళనాడు జిల్లా మెట్టూరు సమీపంలోని మూలక్కాడు కావేరీ నదీ తీరంలో వీరప్పన్ కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ ను గెలిపించేందుకు కాంగ్రెస్ అక్కడ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టింది అని తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన ఉద్యమం నేటికీ 250 వ రోజుకి చేరుకుంది.
22 క్వారెట్ల పది గ్రాముల బంగారం ధర -46,510 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 47,510 .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy