దిశ జుడిషియల్ కమిషన్ దర్యాప్తు వేగవంతం చేసింది.
కమిషన్ ముందు సోమవారం శంషాబాద్ డిసీపీ, లారీ ఓనర్ శ్రీనివాస్ హాజరయ్యారు.
తెలంగాణ భవన్ మంత్రి కేటీఆర్ ప్లీనరీ సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు.ఈ మేరకు ముందుగానే టిఆర్ఎస్ కు చెందిన కీలక నేతలతో నియోజకవర్గాల వారీగా ఆయన సమావేశం నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ కలాన్ లో ఉన్న జెమ్ అవెన్యూ అక్రమ నిర్మాణాలపై టీ పిసిసి అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి కేటీఆర్ పై విమర్శలు చేశారు.
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నేటి సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.ఆదివారం తిరుమల శ్రీవారిని 28, 231 మంది భక్తులు దర్శించుకున్నారు.
ఆజాధీకా అమృతోశ్చవ్ లో భాగంగా సుదర్శన్ భారత పరిక్రమ పేరిట నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ( ఎన్.ఎస్.జి ) ఆధ్వర్యంలో జరుగుతున్న దేశవ్యాప్త బ్లాక్ క్యాట్ కారు ర్యాలీ హైదరాబాద్ కు చేరుకుంది.ఇక్కడి నుంచి చెన్నై కి వెళ్లనున్న ఈ ర్యాలీని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పీపుల్స్ ప్లాజా వద్ద జెండా ఊపి ప్రారంభించారు.
విజయవాడ పడమట లోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం కి ఏపీ సీఎం జగన్ వెళ్లారు.
ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 13,596 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మా లోని ప్రతి సభ్యడికి విష్ణునే అధ్యక్షుడు అని, ఇంకో రెండేళ్లు విష్ణు అధ్యక్షుడిగా గెలుస్తారని బాబు మోహన్ వ్యాఖ్యానించారు.
ప్రకాష్ రాజు ఫైనల్ రాజీనామా లేఖ తనకు అందలేదని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు.
మీలాద్ ఉన్ - నబీ పండుగ సెలవుని అక్టోబర్ 20 కి బదులు, 19 కి మార్చుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన మంచు విష్ణు తన టీమ్ తో కలిసి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
అమెరికాలోని అలస్కాలో భారత్ అమెరికా ఆర్మీ ల మధ్య ఆటల పోటీలు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా భారత్ అమెరికా సైనికుల మధ్య కబడ్డీ మ్యాచ్ జరిగింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు ప్రముఖ పుణ్య క్షేత్రం యాదద్రికి వెళ్లనున్నారు.
ఈనెల 20వ తేదీ నుంచి హుజురాబాద్ లో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆకస్మిక తనిఖీలు చేశారు.ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలపై రోగులను అడిగి తెలుసు కున్నారు.
ఆన్లైన్ సినిమా టికెటింగ్ విధానాన్ని సమర్థిస్తున్నానని మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు.
గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉల్లిపాయల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,070 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 48,070 .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy