ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత రెండు రోజుల క్రితం హైదరాబాద్ సమీప ప్రాంతంలోని శంకర్ పల్లి మండలం లో సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఆ పరిసర ప్రాంతాలలో అల్లు అర్జున్ రెండు ఎకరాల పొలం కొనుగోలు చేయడంతో వాటి రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం శంకర్ పల్లి తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.
అయితే బన్నీ ఉన్నఫలంగా భూమిని కొనుగోలు చేయడానికి కారణం ఏంటి అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు ఆస్తులను పోగు చేసుకుంటున్నారంటూ అభిప్రాయాలు వ్యక్తం చేయగా మరికొందరు మాత్రం ఆ పొలం కొనుగోలు చేయడం వెనుక మరేదో కారణముందంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.
తాజాగా అల్లు అర్జున్ కొన్న భూమి పెట్టుబడులు పెట్టడం కోసం కాదని, ఆ పొలంలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే ఉద్దేశంతోనే భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.ఇప్పటివరకు ఎన్టీఆర్ ఈ ఏరియాలోనే 6 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఇప్పటికే ఇండస్ట్రీలో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, సమంత,మహేష్ బాబు వంటి వారు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడంతో వీరి బాటలోనే అల్లుఅర్జున్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ లో భాగంగా ఎక్కువ శాతం అటవీ ప్రాంతాలలోనే ఉన్నటువంటి అల్లు అర్జున్ కి ఇలా ప్రకృతికి దగ్గరగా ఉండాలి అన్న ఆలోచన రావడంతోనే తాను కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయటం కోసమే ఉన్నఫలంగా భూమిని కొనుగోలు చేశారని తెలుస్తోంది.ఇక సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నారు.త్వరలోనే ఈ చిత్ర నిర్మాణం పూర్తి కావడంతో డిసెంబర్ 17వ తేదీ ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర బృందం ఏర్పాట్లను చేస్తున్నారు.
ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక అనే గ్రామీణ యువతి పాత్రలో సందడి చేయనున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy