తెలుగు తెరపై ఎన్ని రీమేక్ సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయో తెలుసా.. ?

టాంలెంట్ అనేది ఒకరి సొత్తు కాదు.ఎవరు ఎక్కడైనా అద్భుతాలు చేయవచ్చు.

వారిని మిగతా వారు ఫాలో కావొచ్చు.

సినిమా ఇండస్ట్రీలో కూడా అంటే.

ఏ భాషలో మంచి సినిమాలు వచ్చి సక్సెస్ అయినా సరే.మిగతా భాషల్లోకి వాటిని రీమేక్ చేస్తున్నారు.నార్త్, సౌత్ అని తేడా లేకుండా పలు సినిమాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం తెలుగులో రీమేక్ అవుతున్న సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

మాస్ట్రో

Advertisement

బాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్న సినిమా అంధాధున్‌.ఆయుష్మాన్‌ ఖురానా, రాధికా ఆప్టే ఇందులో కీరోల్ ప్లే చేశారు.ఈ సినిమా పస్తుతం తెలుగులో రీమేక్ అవుంది.

దీనికి మాస్ట్రో అనే పేరు పెట్టారు.మేర్లపాక గాంధీ దర్శకత్వం నితిన్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో తమన్నా, నభానటేష్‌ హీరోయిన్లుగా చేస్తున్నారు.

దృశ్యం-2

ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ అయిన సినిమా దృశ్యం-2.ఈ సినిమాలో వెంకటేష్‌, మీనా ప్రధాన పాత్రల్లో తెలుగులో రీమేక్ అవుతోంది.

క్వీన్‌

కంగనా రనౌత్‌ నటించిన బాలీవుడ్‌ మూవీ క్వీన్‌.ఈ మూవీ తెలుగులో దటీజ్‌ మహాలక్ష్మి పేరుతో రీమేక్‌ అవుతోంది.తమన్నా కీ రోల్ ప్లే చేస్తుంది.

ఆర్టికల్‌-15

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!

ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా నటించిన బాలీవుడ్ మూవీ ఆర్టికల్‌-15.పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.ఈ సినిమాను తెలుగులోకి రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

అయ్యప్పనుమ్‌ కోశియుయ్‌

Advertisement

మళయాలం మూవీ అయ్యప్పనుమ్‌ కోశియుయ్‌ అక్కడ సూపర్ హిట్ అయ్యింది.ఈ సినిమాను ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌, రానా హీరోలుగా తెలుగులో రీమేక్ అవుతుంది.ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయ్యింది.

కోమలి

జయం రవి, కాజల్‌ జంటగా నటించిన కోమలి మూవీ మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమా రీమేక్ రైట్స్ ను బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌ తీసుకున్నారు.బాలీవుడ్‌లో ఆయన తనయుడు అర్జున్‌ కపూర్‌తో రీమేక్‌ చేయనున్నారు.

తెలుగులోనూ ఈ సినిమా రీమేక్ చేస్తున్నట్లు తెలుస్తోంది.వీటితో పాటు మరికొన్ని సినిమాలు సైతం రీమేక్ అవుతున్నాయి.

తాజా వార్తలు