హీరో కార్తికేయకు ఘోర అవమానం... అసలేమైందంటే?

సినిమా పరిశ్రమలో స్థిర పడాలని చాలా మంది కోరుకుంటారు.కొంత మందికి మాత్రమే అది సాధ్యమవుతుంది.

ప్రయత్నాలు చాలా మంది చేస్తారు.కాని అవకాశాలు మాత్రం కొద్ది మందికి మాత్రమే వస్తాయి.

అయితే అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో చాలా రకాల సంఘటనలు ఎదురవుతుంటాయి.ఇక ఆ పరిస్థితి ఎలా ఉంటుందో మొదట్లో సినిమా ప్రయత్నాలు చేసి ఇప్పుడు స్టార్ గా ఎదిగిన వారు కొన్ని కొన్ని సందర్భాలలో తమ అనుభవాలను పంచుకుంటారు.

ఇక అవకాశాలను సాధించుకునే క్రమంలో ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.అయితే అప్పుడు ఆ సదరు నటుడికి బాధాకరంగా అనిపించినా ఆ తరువాత అవి చాలా తీపి గుర్తులలా అనిపిస్తాయని చాలా మంది నటులు చెప్పగా మనం విన్నాం.

Advertisement

అయితే తాజాగా హీరో కార్తికేయ నటుడిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో తనకు జరిగిన ఒక అవమానాన్ని ఓ ఇంటర్వ్యూ లో వివరించాడు.అయితే డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ని కలవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆఫీస్ కు వెళ్తే గంటల తరబడి నిరీక్షించినా కలవడం సాధ్యపడలేదని, అయితే టెంపర్ సినిమా షూటింగ్ సమయంలో పూరీ జగన్నాథ్ ని కలవడానికి వెళ్తే బౌన్సర్స్ నన్ను తోసేసారని, ఆ తరువాత పూరీ జగన్నాథ్ చూసి నంబర్ తీసుకొని అవకాశం ఉంటే తెలపుతానని అన్నాడని, ఆ తరువాత ఈ విషయాన్ని పూరీ గారికి తెలిపానని కార్తికేయ తెలిపారు.

అందుకే నేను ఏ రోజు సొంత పిల్లల గురించి ఆలోచించ లేదు : రాజమౌళి
Advertisement

తాజా వార్తలు