అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు

కన్నడంలో సూపర్ హిట్ అయిన బెల్ బాటమ్ అనే సినిమాతో హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా అదే టైటిల్ తో రీమేక్ చేశారు.

ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అయ్యింది.

పూజా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రంజిత్ ఎం తివారి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో పీరియాడిక్ జోనర్ లో ఈ సినిమాని కాస్త నేటివిటీ మార్చుకొని సినిమాని తెరకెక్కించారు.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్ డిటెక్టివ్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది.ఈ నేపధ్యంలో రిలీజ్ కి రెడీగా ఉన్న చాలా సినిమాలని ఒటీటీలో రిలీజ్ చేయడానికి దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.

ఒటీటీ చానల్స్ కూడా సినిమా హీరో, దానికున్న హైప్ బట్టి డబ్బులు చెల్లించేందుకు ముందుకొస్తున్నారు.దీంతో చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అన్ని కూడా ఓటీటీ బాట పడుతున్నాయి.

Advertisement

ఇప్పట్లో థియేటర్స్ మళ్ళీ ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.దానికి తోడు ఓపెన్ అయినా మునుపటిలా ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారా అనేది అనుమానమే.

ఈ నేపధ్యంలో ఓటీటీ బెటర్ అనే మాట వినిపిస్తుంది.ఇక అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ సినిమాని కూడా ఒటీటీలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తుంది .గత ఏడాది అక్షయ్ కుమార్ లక్ష్మి సినిమాని ఒటీటీలో రిలీజ్ చేశారు.దీంతో బెల్ బాటమ్ కూడా అదే బాటలో ఒటీటీకి వెళ్తుందనే టాక్ నడిచింది.

దీనిపై చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.బెల్ బాటమ్ ఓటీటీ రిలీజ్ వైపు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తేల్చేశారు.

ఏ స్టేట్ మెంట్ అయిన నిర్మాణ సంస్థ నుంచి వస్తుందని, బయట నుంచి వచ్చే ప్రకటనలు నమ్మొద్దని పేర్కొన్నారు .

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు