తనలోని కొత్త టాలెంట్ ని బయటపెట్టిన జాన్వీ కపూర్

అందాల భామలు తెరపై తమ అందం, అభినయంతో ప్రేక్షకులకి వినోదం పంచడమే కాకుండా అప్పుడప్పుడు తమలోని హిడెన్ టాలెంట్స్ ని బయట పెడుతూ ఉంటారు.

ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది.

అయితే ఆ టాలెంట్ ని చూపించుకునే సమయం, సందర్భం రాకపోవడంతో వాటి గురించి బయట ఎవరికి తెలియదు.అయితే గత ఏడాది కరోనా సీజన్ మొదలైన తర్వాత సెలబ్రిటీలకి షూటింగ్ లు లేకపోవడంతో ఇంటిపట్టునే ఉంటున్నారు.

షూటింగ్ లతో బిజీగా ఉండి ఒక్కసారిగా ఖాళీగా ఇంట్లో కూర్చోవడం అంటే వారికి కష్టంగానే ఉంటుంది.ఈ నేపధ్యంలోనే సెలబ్రిటీలు వారి టాలెంట్ లని బయట పెడుతున్నారు.

ఆ మధ్య స్టార్ కమెడియన్ బ్రహ్మానందం తనలో దాగి ఉన్న చిత్రకారుడుని బయటకి తీసుకొచ్చి చూపించాడు.మంచి నైపుణ్యం ఉన్న కళాకారులు కుంచె నుంచి వచ్చిన బొమ్మ ఎంత అద్బుతంగా ఉంటుందో అంతే గొప్పగా బ్రహ్మానందం పెన్సిల్ స్కెచ్ వెంకటేశ్వర స్వామి చిత్రపటం గీశారు.

Advertisement

ఇదిలా ఉంటే అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జూనియర్ శ్రీదేవిగా ప్రశంసలు అందుకుంటున్న జాన్వీ కపూర్ తాజాగా తనలోని చిత్రకారిణిని బయటకి తీసుకొచ్చింది.ఆమె వేసిన పెయింటింగ్స్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి తనలోని కళని అభిమానులకి పరిచయం చేసింది.

పెయింటింగ్ డేస్ తిరిగి వచ్చాయి అనే ట్యాగ్ తో ఈ ఫోటోలని షేర్ చేసింది.యానిమేటెడ్ పాత్రలు, నేచర్ బ్యూటీ, తనకి ఇష్టమైన వెంకటేశ్వర స్వామి, ఫ్లవర్స్ పెయింటింగ్స్ ని జాన్వీ షేర్ చేశారు.

తన ఆర్ట్ ను ప్రపంచానికి పరిచయం చేయడానికి వారం రోజులుగా చిత్రకారిణిగా మారిపోయాను అని ఈ సందర్భంగా జాన్వీ పోస్ట్ పెట్టింది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు