చాలా ఏళ్ల తర్వాత సాగర కన్య టాలీవుడ్‌ లో రీ ఎంట్రీ.. అది కూడా ప్రభాస్‌ మూవీతో!

బాలీవుడ్‌ సీనియర్‌ స్టార్ హీరోయిన్స్ జాబిత తీస్తే అందులో ఖచ్చితంగా ముందు వరుసలో ఉండే ముద్దుగుమ్మ శిల్పా శెట్టి.

ఈ అమ్మడు తెలుగులో చేసిన పలు సినిమా లు సూపర్‌ హిట్ అయ్యాయి.

ముఖ్యంగా తెలుగు లో వెంకటేష్‌ కలిసి చేసిన సహస వీరుడు సాగర కన్య సినిమా ఇప్పటికి ఎప్పటికి నిలిచి పోతుంది అనడంలో సందేహం లేదు.ఇక భలే వాడివి బాసూ మరియు వీడెవడండీ బాబు సినిమాలు కూడా మంచి విజయాలను దక్కించుకున్నాయి.

తెలుగులో చాలా సంవత్సరాలుగా పొడుగు కాళ్ల సుందరి కనిపించడం లేదు.మళ్లీ తెలుగులో నటించే అవకాశాలు లేవని అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ప్రభాస్‌ మూవీలో ఈమె కనిపించబోతున్నట్లుగా బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం శిల్పా శెట్టిని ఇద్దరు తెలుగు ఫిల్మ్‌ మేకర్స్ ఆమెను సంప్రదించారని అంటున్నారు.ప్రభాస్‌ హీరోగా భారీ బడ్జెట్‌ తో రూపొందబోతున్న సోఫియో ఫాంటసీ సినిమా లో కీలక పాత్ర కోసం నాగ్‌ అశ్విన్‌ ఇటీవలే శిల్పను కలిసినట్లుగా తెలుస్తోంది.

Advertisement

కథ మరియు పాత్ర విషయమై పూర్తి క్లారిటీ ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌ ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాడు.ఇక ఇదే సమయంలో ఎన్టీఆర్‌ మరియు త్రివిక్రమ్‌ మూవీ లో కూడా ఈమెను ఎంపిక చేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

సీనియర్‌ హీరోయిన్ లను త్రివిక్రమ్‌ తీసుకు వస్తూ ఉంటాడు.అందులో భాగంగానే ఈసారికి ఈమెను తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు అంటున్నారు.

ప్రస్తుతం ఈ రెండు సినిమా ల విషయమై ఆమె ఎలాంటి నిర్ణయాన్ని అయితే ఇవ్వలేదు.కాని రెండు కాకున్నా కనీసం ఒక్క సినిమా లో అయినా సాగర కన్య శిల్ప శెట్టి కనిపించడం ఖాయం అంటున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు