దృశ్యం 2 స్పీడు మామూలుగా లేదుగా!

మలయాళ సూపర్ హిట్ మూవీ ‘దృశ్యం’కు సీక్వెల్‌గా ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయిన ‘దృశ్యం-2’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో అదిరిపోయే సక్సెస్ అందుకుంది.

ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ప్రస్తుతం ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

కాగా తెలుగులో ఈ సినిమాను స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌తో తెరకెక్కించే పనులు అప్పుడే ప్రారంభమయ్యాయి.గతంతో వెంకీ నటించిన దృశ్యం చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

దీంతో ఇప్పుడు వెంటనే దృశ్యం-2 సీక్వెల్ రీమేక్ పనులు మొదలుపెట్టాడు దర్శకుడు జీతూ జోసెఫ్.ఈ క్రమంలో ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించిన చిత్ర యూనిట్, ప్రస్తుతం శరవేగంగా ఈ షూటింగ్‌ను జరపుకుంటోంది.

ఈ షూటింగ్‌లో చిత్రంలోని ముఖ్య నటీనటులు అందరూ పాల్గొంటున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి తెలుగులో బ్రహ్మాండమైన రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Advertisement

ఈ సినిమాను ప్రేక్షకులు థియేటర్లలో చూసే వీలుంటుంది కాబట్టి ఏవిషయంలో కూడా చిత్ర యూనిట్ కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో వెంకటేష్‌తో పాటు హీరోయిన్ మీనా, నరేశ్, నదియా, సంపత్ లాంటి కీలక నటీనటులు నటిస్తున్నారు.

మొదటి భాగం ఎలాంటి విజయాన్ని అందుకుందో, ఈ సీక్వెల్ చిత్రం అంతకంటే ఎక్కువ విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.ఈ సినిమాను 2021 ద్వితీయార్థలో రిలీజ్ చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

మొత్తానికి దృశ్యం సీక్వెల్ చిత్రం మామూలు స్పీడుగా లేదని చిత్ర వర్గాలతో పాటు క్రిటిక్స్ అంటున్నారు.మరి దృశ్యం తొలిభాగం అందుకున్న విజయాన్ని దృశ్యం-2 అందుకుంటుందో లేదో చూడాలి.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు