వైరల్: మహిళపై ఫుడ్ డెలివరీ బాయ్ పిడిగుద్దుల వర్షం..!

ప్రస్తుతం ఉరుకులు పరుకుల  ప్రపంచంలో చాలామంది వారి రోజు వారి పనులను చాలా బిజీగా ఉంటున్నారు.

ఈ క్రమంలో ఇంట్లో ఫుడ్ వండుకోవడానికి కూడా సమయం లేక ఆన్లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేస్తూ ఉన్నారు.

ఈ క్రమంలో చాలా మంది జొమాటో, ఫుడ్ పాండా తదితర వెబ్సైట్ లను ఆశ్రయిస్తున్నారు.ఇదిలా వుండగా తాజాగా ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వివాదంలో చిక్కుకుంది.

జొమాటో కు చెందిన ఒక డెలివరీ బాయ్ మహిళ పై దాడికి పాల్పడిన సంఘటన బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది.ఈ చిన్న పాటి వివాదంలో ఆ మహిళకు రక్తం వచ్చేలాగా అనుచితంగా దాడికి పాల్పడిన డెలివరీ బాయ్.

దింతో ఆ మహిళ ఆమె తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేసింది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.

Advertisement

ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.మార్చ్ 9 మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో బెంగళూరు నగరంలోని కంటెంట్ సృష్టికర్త, మేకప్ ఆర్టిస్ట్‌ హితేషా ఆర్డర్  ఇవ్వగా సాయంత్రం 4.30 గంటలకు ఫుడ్ డెలివరీ చేయాల్సి ఉంది.అయితే ఆ సమయానికి ఆర్డర్ రాకపోవడంతో ఆమె ఇచ్చిన ఆడర్ ఆలస్యం కావడంతో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడి తన  ఆర్డర్ క్యాన్సల్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు.

ఇంతలోనే డెలివరీ బాయ్ ఆర్డర్ తీసుకుని ఇంటి వద్దకు రాగా ఈ క్రమంలో చిన్న వివాదానికి  దిగిన డెలివరీ ఎగ్జిక్యూటివ్ కామరాజ్ ఆగ్రహంతో ఘర్షణకు పాల్పడ్డాడు.అంతే కాకుండా బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి ఆమె పై పిడిగుద్దులు వర్షం కురిపించాడు.

ఇక చివరికి తన ఆర్డర్ ను తీసుకొని మరి అక్కడి నుంచి డెలివరీ బాయ్ పారిపోయినట్లు ఆమె తెలియచేసారు.ఈ సందర్భంగా జొమాటో సేవలు సురక్షిత మేనా అంటూ హితేషా వాపోయారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు