కేసిఆర్, కేటీఆర్ లపై కీలక కామెంట్స్ చేసిన బండి సంజయ్..!!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా గూడూరు మండలం మచ్చర్లలో మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో జరుగుతున్న అన్ని సీఎం సర్వేలలో బిజెపి పార్టీకి అనూహ్యమైన స్పందన వస్తుంది అని పేర్కొన్నారు.

దీంతో కేసిఆర్ లో అభద్రత భావం నెలకొంది అని, రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికి కెసిఆర్ బహు రూపాల వేషం వేస్తున్నాడు జిమ్మిక్కులు చేస్తున్నాడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఏనాడైనా రాష్ట్రంలో సొంత పార్టీ టిఆర్ఎస్ పార్టీ నేతలను గెలిపించాలని కేసీఆర్ సర్వే చేసిన సందర్భాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు.

< అహంకార పూరితమైన నాయకుడు కేసీఆర్ అని సీరియస్ కామెంట్ చేశారు.ప్రజలను ఓట్లు అడగాలి పార్టీకి ఎందుకు ఓట్లు వేయడం ఉంటూ బండి సంజయ్ మండిపడ్డారు.

అదే రీతిలో మంత్రి నిరంజన్ రెడ్డి.రాష్ట్రంలో ఉపాధ్యాయులను బెదిరిస్తున్నారని ఆరోపించారు.

Advertisement

మరోపక్క ప్రభుత్వం కూడా ఎన్నికల డ్యూటీ వేయకుండా రాష్ట్రంలో ఉన్న టీచర్లను అవమానం చేస్తున్నారని.జుటా బాప్.

జూటా బేట అంటూ కేసీఆర్‌, కేటీఆర్‌లపై సీరియస్ కామెంట్లు బండి సంజయ్ చేశారు.అంతమాత్రమే కాకుండా ఇటీవల రైల్వే శాఖ గురించి కేంద్రం పై విమర్శలు చేసిన కేటీఆర్ కి కౌంటర్లు వేశారు.

ITIR, రైల్వే కోచ్ గురించి కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదని నిప్పులు చెరిగారు.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే PRC, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు ఇస్తామని అదేరీతిలో పోడు సమస్య కూడా  తీరుస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.

కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు