కరోనా నుంచి కోలుకున్న వరుణ్.. మరి చరణ్..?

టాలీవుడ్ యంగ్ హీరో, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు.వరుణ్ తేజ్ కు కరోనా నెగిటివ్ నిర్ధారణ అయింది.

తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వరుణ్ తేజ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.కరోనా నెగిటివ్ రావడం గురించి వరుణ్ స్పందిస్తూ నెగిటివ్ అనే పదం ఇంత ఆనందాన్ని ఇస్తుందని తాను ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు.

కరోనా సోకిన సమయంలో అభిమానులు చూపించిన ప్రేమ, ఆప్యాయతలకు ధన్యవాదాలు అని తెలిపారు.గత నెల 27వ తేదీన వరుణ్ తనకు కరోనా సోకినట్టు ప్రకటించారు.

కొద్దిపాటి కరోనా లక్షణాలు కనిపించాయని క్వారంటైన్ లో ఉన్నానని పేర్కొన్నారు.వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సర్, ఎఫ్ 3 సినిమాల్లో నటిస్తున్నారు.

Advertisement

ఎఫ్ 2 సినిమా 80 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలు చేయడంతో ఎఫ్ 3 సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.అయితే వరుణ్ కు కరోనా నెగిటివ్ వచ్చినా చరణ్ నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు.

అయితే చరణ్ కు కూడా కరోనా నిర్ధారణ కాగా అతి త్వరలో కరోనా నెగిటివ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.చరణ్ కు కరోనా నిర్ధారణై ఈరోజుకు 13వ రోజు కావడంతో రామ్ చరణ్ తన ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా అప్ డేట్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కొందరు చరణ్ అభిమానులు చరణ్ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ సినిమాలో కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్నారు.కరోనా నుంచి కోలుకున్న తరువాత చరణ్ ఆచార్య షూటింగ్ లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది.

ఆచార్య సినిమా సమ్మర్ లో విడుదల కానుండగా ఆర్ఆర్ఆర్ దసరా పండుగకు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు