టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం “వకీల్ సాబ్” సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల వాయిదా పడుతూ వస్తోంది.
ఇప్పటికే చిత్ర నిర్మాణం దాదాపు పూర్తి చేసుకుందని చెప్పవచ్చు.ఈ చిత్ర నిర్మాణంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
లీకైన పవన్ కళ్యాణ్ ఫోటోలో ఒక షీల్డ్ మీద పోలీస్ అని రాసి ఉన్న స్టిక్కర్ ను తొలగిస్తున్నారు.ఈ సినిమాలో భాగంగా పవన్ కళ్యాణ్ ఓ యాక్షన్ సన్నివేశంలో ఆ షీల్డ్ ను ఉపయోగించనున్నారు.
అయితే ఆ యాక్షన్ సీన్ లో పోలీస్ అని రాసి ఉన్న షీల్డ్ ను వాడితే అది ప్రేక్షకులలో తప్పుగా ప్రొజెక్ట్ అవుతుందన్న ఉద్దేశంతో, ఆ స్టిక్కర్ ను తీసేసినట్లు తెలిపారు.అంతేకాకుండా ఈ చట్టం పై, పోలీసు యంత్రాంగం పై ఎంతో గౌరవం ఉండటం వల్ల ఆ పేరును తీసేసి ఆ షీల్డ్ ను యాక్షన్ సీన్ లో ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులకు ఎదురుచూస్తున్నారు. నూతన సంవత్సరం కానుకగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
అయితే ఈ విషయంపై చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన మూడోసారి శృతిహాసన్ జతకట్టనుంది.అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.