ఓటీటీలో హిట్ అయిన తెలుగు సినిమా ఏదో తెలుసా?

ఓటీటీ.ఒకప్పుడే ఉన్న.

ఇందులో డైరెక్ట్ గా సినిమాలు విడుదల అవుతాయి అనే విషయం ఎవరికి తెలియదు.

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగానే ఓటీటీలో డైరెక్ట్ సినిమాలు విడుదల చేస్తారని తెలిసింది.

సంవత్సర ప్రారంభంలో సినిమా రిలీజ్ అయినా రోజే ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు అంటే అందరూ గొడవ చేశారు కానీ కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా కొన్ని సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యాయి.అలా విడుదల అయినా సినిమాల్లో హిట్ అయినా తెలుగు సినిమా ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.ఓటీటీలో మొదట విడుదల అయినా తెలుగు చిత్రం అమృతరామమ్.జీ5లో వచ్చిన ఈ చిత్రం కేవలం యువతను దృష్టిలో పెట్టుకొని తీసింది.ఇది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

ఆతర్వాత వచ్చిన చిత్రం పెంగ్విన్.కీర్తి సురేష్ నటించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది.

Advertisement

అయితే ఊహించిన రేంజ్ లో లేకపోవడంతో యావరేజ్ టాక్ తెచ్చుకుంది.ఆతర్వాత కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా.

ఈ రొమాంటిక్ చిత్రం మొదట నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాగా ఆతర్వాత ఆహా యాప్ లో స్ట్రీమ్ అయ్యింది.ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఆతర్వాత ఆహా యాప్ లో విడుదల అయినా భానుమతి రామకృష్ణ.మంచి కథతో వచ్చిన కూడా హిట్ అవ్వలేకపోయింది.ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య.

సత్యదేవ్ నటించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది.ఆహా యాప్ లో రిలీజ్ అయినా మరో చిత్రం జోహార్‌.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఈ సినిమా ప్రస్తుత రాజకీయాలపై తియ్యగా ఈ సినిమా తీసిన విధానం అందరికి నచ్చింది.న్యాచురల్ స్టార్ నాని నటించిన చిత్రం వి.

Advertisement

ఈ సినిమాలో ఇద్దరు హీరోలు నటించిన సరే అంచనాలను అందుకోలేక అట్టర్ ప్లాప్ గా నిలిచింది.

నిశ్శబ్దం సినిమాతో వచ్చిన అనుష్క అంతే నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది.లేడీ ఓరియేంటేడ్ చిత్రం అయినా సరే ఆకట్టుకోలేకపోయింది.ఆతర్వాత రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్‌ బుజ్జిగా.

చిత్రం కామెడీ సినిమాగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఆహా లో రిలీజ్ అయ్యి కన్నీళ్లు పెట్టించిన చిత్రం కలర్ ఫోటో.

సుహాస్‌, చాందినీ చౌదరి నటించిన ప్రేమ కథా చిత్రం కలర్ ఫోటో క్రిటిక్స్ ని సైతం మెప్పించింది.ఓటిటిలో విడుదలైన కీర్తి సురేష్ రెండో చిత్రం మిస్‌ ఇండియా.

ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

గతం. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఇండియన్ పనోరమా కేటగిరీలో ప్రదర్శించనున్న ఏకైక తెలుగు చిత్రంగా నిలిచింది.ఇక ఆఖరి ఓటీటీ చిత్రం మిడిల్ క్లాస్ మెలోడీస్.

నిజంగానే ఈ చిత్రం అందరిని మెప్పించింది.వావ్ అనిపించింది.

ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ చిత్రం పైన చెప్పిన అన్ని సినిమాల కంటే సూపర్ హిట్ సినిమా.ఇలా ఓటీటీలో విడుదలై అందరిని ఆకట్టుకుంది ఈ సినిమా.

తాజా వార్తలు