వైరల్ ఫోటో: జింకను పోలిన ఎలుక...!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా ప్రపంచం మొత్తం ఇట్లే తెలిసిపోతుంది.

ఈ మధ్యకాలంలో జంతువులకు సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.

ఇక తాజాగా తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో జింక రూపాన్ని కలిగి ఉన్న ఎలుకలు స్థానికులకు కనబడ్డాయి.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా లోని సత్తుపల్లి జి.వి.ఆర్ ఓపెన్ కాస్ట్ సమీపంలో ఉన్న కొమ్మేపల్లి అడవి ప్రాంతంలో ఈ జింక రూపంలో ఉన్న ఎలుకలు మూషిక జింకలు కనపడ్డాయి.ఇది చూసిన కొందరు ఆశ్చర్యపోయారు.

అయితే వీటిని వారు చూసిన వెంటనే అందుకు సంబంధించి వివరాలను అటవీ అధికారులకు తెలియజేయడంతో వారు వాటిని స్వాధీనం చేసుకున్నారు.అలా ఆ మూషిక జింకను తీసుక వెళ్లాక వాటికి పరీక్షలు నిర్వహించిన తర్వాత తిరిగి మళ్లీ కిన్నెరసాని అడవి ప్రాంతంలో వాటిని వదిలేశారు.

Advertisement

ఇందుకు సంబంధించి అటవీ అధికారులు మాట్లాడుతూ ఇలాంటి మూషిక జింకలు చాలా అరుదుగా లభిస్తాయని తెలియజేశారు.ఈ మూషిక జింకను ముందుగా ఆ అటవీ ప్రాంతంలో ఓ లారీ డ్రైవర్ కు కంటపడ్డాయి.

దీంతో ఆయన చుట్టు పక్కల ఉన్న వారికి తెలియజేయడంతో అక్కడే ఉన్న సింగరేణి కార్మికులు వాటిని అటవీ అధికారులకు అప్పగించారు.వారికి దొరికిన మూషిక జింకలు కేవలం మూడు నెలల వయసు ఉంటుందని వారు అంచనా వేశారు.

ఇలాంటివి మూషిక జింకలు కేవలం దట్టమైన అటవీ ప్రాంతాల్లోని కనిపిస్తాయని అధికారులు తెలుపుతున్నారు.కాకపోతే, ఇలా జనం తిరుగుతున్న అడవిలో కూడా కనిపించడం చాలా ఆశ్చర్యం వేస్తుందని అధికారులు తెలిపారు.

ప్రపంచంలో అంతరించే జీవుల్లో ఈ మూషిక జింక కూడా ఒకటని అధికారులు తెలియజేశారు.ఇలాంటి మూషిక జింకలు కనిపించడంతో అటవీ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు