వై.ఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్లాన్ చేసి హత్య చేశారంటున్న సీనియర్ నటి....

ఒకప్పుడు తెలుగులో మంచి హిట్ అయిన గోకులంలో సీత, పెళ్ళికానుక, పెళ్లి పందిరి, తదితర చిత్రాలలోక్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రాధా ప్రశాంతి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.

అయితే తాజాగా రాధా ప్రశాంతి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వై.

ఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ మరణంపై పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.ఇందులో భాగంగా అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రధాన మంత్రి అయ్యే సత్తా ఉన్నటువంటి వ్యక్తి అని ఆయన ప్రస్తుతం బ్రతికి ఉంటే కచ్చితంగా ప్రధాన మంత్రి అయ్యేవాడని, కానీ కొంతమంది ప్లాన్ చేసి మరీ వై.

ఎస్ రాజశేఖర్ రెడ్డిని హత్య చేశారని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.అంతేకాక ఈ కుట్రలో దేశంలోనే సంపన్నమైన ఓ కుటుంబం మరియు తరతరాలుగా రాజకీయాలలో తిరుగులేని  కుటుంబం, అలాగే మరికొంతమంది రాజకీయ నాయకులు కలిసి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి  హత్య కు స్కెచ్ వేశారని కావాలంటే తాను ఈ విషయాన్ని ఎక్కడైనా సరే నిరూపిస్తానని  అంటూ ధీమా వ్యక్తం చేసింది.అంతేకాక ఒకప్పుడు రాష్ట్రంలోని ప్రజలు కరువు కాటకాలతో అల్లాడుతుంటే వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజలకు చాలా మంచి చేశాడని అలాంటి నాయకుడు మరణం రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని చెప్పుకొచ్చింది.ఇక తన సినీ అవకాశాల విషయానికొస్తే అందరిలాగే తాను కూడా మొదట్లో హీరోయిన్ కావాలని వచ్చానని కానీ కొంతమంది దర్శక నిర్మాతలకి పడక గది కమిట్మెంట్ ఇవ్వలేక హీరోయిన్ కాలేకపోయానని తెలిపింది.

వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..
Advertisement

తాజా వార్తలు