మద్యం మత్తులో వావి వరుసలు మరచి కన్న కూతురి పైనే...

ప్రస్తుత కాలంలో కొందరు వ్యక్తులు తాగిన మైకంలో వావి వరసలు మరిచి పోయి తమ రక్తం పంచుకు పుట్టిన వారిపైనే అత్యాచార యత్నానికి పాల్పడుతున్నారు.

తాజాగా ఓ వ్యక్తి పీకల దాకా మద్యం తాగి, ఇంట్లో నిద్రిస్తున్నటువంటి తన కన్న కూతురు పైనే అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకు చెందిన టువంటి పెదనందిపాడు పరిసర ప్రాంతంలో ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు.అయితే ఇతడు కుటుంబ పోషణ నిమిత్తం గ్రామంలో చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడు.

అప్పుడప్పుడు ఈ వ్యక్తి మద్యం సేవిస్తూ కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ ఉండేవాడు.తాజాగా మరోమారు పీకల దాకా మద్యం తాగి ఇంటికి వచ్చి తన ఇంట్లో మంచంపై నిద్రిస్తున్నటువంటి తన కూతురిపై దారుణంగా అత్యాచారం చేశాడు.

అంతేకాక ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.అయితే బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన ఆమె తల్లి ఏమైందని నిలదీయగా బాలిక తన పై జరిగినటువంటి అఘాయిత్యం గురించి తెలియజేసింది.

Advertisement

దీంతో వెంటనే బాలిక తల్లి బాధితురాలిని వెంట బెట్టుకుని దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకునిం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ విషయం తెలుసుకున్న కొందరు నెటిజన్లు ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలకు రక్షణ కరువైందని ఇలాంటి పరిస్థితులే కొనసాగితే ఖచ్చితంగా భవిష్యత్తులో తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు