రానా కొత్త నిర్ణయంతో ఫ్యాన్స్ ఖుష్

టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి బాహుబలి చిత్రం తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

కాగా మరో పాన్ ఇండియా మూవీతో రానా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.

అరణ్య అనే సినిమా గతకొద్ది రోజుల క్రితమే షూటింగ పనులు ముగించుకుంది.అయితే ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది.

దీంతో ఈ సినిమా రిలీజ్‌ను చిత్ర యూనిట్ వాయిదా వేశారు.కాగా పలు సినిమాలను చాలా సెలెక్టివ్‌గా ఎంచుకుంటున్న రానా, ఒక సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వెబ్ సిరీస్‌లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని త్వరలోనే ఓ మంచి వెబ్ సిరీస్‌లో నటించాలని నిర్ణయం తీసుకున్నాడు.దీంతో పలు వెబ్ సిరీస్‌ల కథలను ఆయన వింటున్నాడట.

Advertisement

ఇప్పుడు అందరూ కూడా ఓటీటీల్లోని వెబ్ సిరీస్‌లకు అలవాటు పడ్డారనే విషయాన్ని ఆయన గుర్తించి, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే రానా బుల్లితెరపై యాంకర్‌గా తన సత్తా చాటిన విషయం తెలిసిందే.

‘యారీ నెంబర్ 1’ అనే షోకు రానా వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.ఇప్పుడు వెబ్ సిరీస్‌లలో కూడా నటించేందుకు రానా ఒప్పుకోవడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా తెలుగులో విరాట పర్వం అనే సినిమాలో రానా మెయిన్ లీడ్‌లో నటిస్తున్నాడు.ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరి రానా ఎలాంటి వెబ్ సరీస్‌లో నటిస్తాడో చూడాలి.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు