బన్నీ అడ్డాలో మహేష్ పాగా.. రికార్డులకే రికార్డు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది.

ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో అల్లు అర్జున్ సినిమాలు పలు రికార్డులు క్రియేట్ చేశాయంటే అక్కడ ఆయనకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.

ఇక బన్నీ సినిమా రిలీజ్ అవుతుందంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళలో కూడా సందడి నెలకొంటుంది.అయితే సంక్రాంతి పండగ సీజన్‌లో రానున్న అల వైకుంఠపురములో సినిమాపై ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

సాధారణంగా కేరళ రాష్ట్రంలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరోగా బన్నీ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.అలాంటిది ఇప్పుడు బన్నీ అడ్డాలో సూపర్ స్టార్ మహేష్ బాబు పాగా వేశాడు.

మహేష్ బాబు నటిస్తోన్ సరిలేరు నీకెవ్వరు చిత్రం కూడా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుండటంతో ఈ సినిమాను అక్కడ భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.దీంతో కేరళలో ఇప్పటివరకు ఎన్నడూ రిలీజ్ కాని స్థాయిలో ఏకంగా 30 సెంటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

Advertisement

బన్నీ సినిమా కూడా అక్కడ ఈ స్థాయిలో రిలీజ్ కాలేదు అంటే సరిలేరు నీకెవ్వరు చిత్రంపై ఎలాంటి అంచనాలు ఏర్పడ్డాయో అర్ధం చేసుకోవచ్చు.మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోండగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా నటిస్తుంది.మరి ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో కూడా ఎలాంటి రికార్డును క్రియేట్ చేస్తుందో చూడాలి.ఇంకో విశేషమేమిటంటే కొచ్చిలో ఉదయం 6.30 గంటలకే మొదటి షో పడనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!
Advertisement

తాజా వార్తలు