అల వైకుంఠపురములో కత్తెరకు రెడీ.. పోయేదేమీ లేదంటున్న బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతోంది.

ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా శనివారం నాడు సెన్సార్ బోర్డు ముందుకు వెళ్లనుంది.

పూర్తి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు సెన్సార్ నుండి ఎలాంటి ఇబ్బంది ఉండదని చిత్ర యూనిట్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.తనదైన శైలిలో త్రివిక్రమ్ ఈ సినిమాలో అన్ని అంశాలు మిలితం చేశారని, బన్నీ యాక్టింగ్, త్రివిక్రమ్ టేకింగ్, థమన్ సంగీతం ఇలా అన్ని కలిసి ఈ సినిమాను సూపర్ సక్సెస్ చేయడం ఖాయమని అంటున్నారు సినీ జనాలు.

ఇప్పటికే ఈ సినిమా పాటలకు సెన్సేషనల్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక సెన్సార్ బోర్డు సభ్యులు కూడా ఈ సినిమాను తిలకించేందుకు ఆసక్తి చూస్తున్నారని చిత్ర యూనిట్ తెలిపింది.

పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా సంక్రాంతి బరిలో జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వారు ఎలాంటి సర్టిఫికెట్ ఇస్తారో చూడాలి.

Advertisement

అటు మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు