కోపంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు

యంగ్ టైగర్ అభిమానులకి పిచ్చి కోపం వచ్చేసింది .సోషల్ మీడియాలో పట్టరాని ఆగ్రహంతో ఊగిపోతున్నారు .

కారణం ఈ ఏడాది జరగబోయే సైమా అవార్డులు .ఇంతకీ సైమా వారు ఎన్టీఆర్ ని ఏమన్నారు అనే కదా మీ ప్రశ్న .ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళదాం .జూన్ 30, జులై 1 న సింగపూర్ వేదికగా జరగనున్నాయి సైమా అవార్డులు .ఈ అవార్డులకి సంబంధించి ఆన్ లైన్ పోల్ ఇప్పటికే మొదలైంది .ఉత్తమ తెలుగు నటుడు కేటాగిరిలో మహేష్ బాబు ఉన్నాడు, ప్రభాస్ ఉన్నాడు, అల్లు అర్జున్ ఉన్నాడు, వరుణ్ తేజ్ ఉన్నాడు, నాని ఉన్నాడు.కాని ఎన్టీఆర్ లేడు .గత సంవత్సరం టెంపర్ లాంటి మంచి సినిమాతో పాటు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఎన్టీఆర్ ని సైమా గుర్తించలేదని, సైమా అవార్డ్స్ పేరుకే గొప్ప అని నిర్వాహకుల మీద విరచుకుపడుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.ఇంకా సమయం ఉంది కాబట్టి, ఎన్టీఆర్ ని నామినేట్ చేస్తే బాగుంటుందేమో.

సెట్లో బాలకృష్ణ, నాగార్జున ఎవరితో ఎలా ఉంటారో చెప్పేసిన నాగ మహేష్?

తాజా వార్తలు