ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు...కాల్పులు.... ముగ్గురు మృతి!

అగ్రరాజ్యం అమెరికా లో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది.

ఇటీవల ఒక పాఠశాలలో పూర్వ విద్యార్థి కాల్పులు జరిపిన ఘటన మరువక ముందే మరోసారి అమెరికా లో కాల్పుల మోత మోగింది.

అమెరికా మిస్సోరీలోని సెయింట్ లూయీస్ నగరంలో గల ఓ ఇంట్లోకి దుండగులు చొరబడి కాల్పులు జరపడం తో ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తుంది.సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.

ష్రెవె 4000 బ్లాక్ లోని ఓ ఇంట్లో కి చొరబడ్డ దుండగుడు కాల్పులు తెగబడడం తో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయాలపాలైనట్లు తెలుస్తుంది.అయితే గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

కాల్పులు జరిగినట్లు సమాచారం రావడంతో పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు.అయితే ఇంటి ముందు ఓ వ్యక్తి, ఇంట్లో మరో నలుగురు బుల్లెట్ గాయాలతో కన్పించడం తో అధికారులు సహాయం అందించే ప్రయత్నం చేసారు.

Advertisement

అయితే అప్పటికె ముగ్గురు మృతిచెందగా.ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

బాధితులంతా 20 నుంచి 30ఏళ్ల మధ్య ఉన్న నల్లజాతీయులని,ఆసుపత్రిలో చేరిన ఇద్దరిలో ఒకరి పరిస్థితి అధికారులు వెల్లడించారు.అయితే అసలు ఈ కాల్పులు ఎవరు జరిపారన్న విషయం మాత్రం ఇంకా తెలియలేదు.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..
Advertisement

తాజా వార్తలు