మిర్యాలగూడ బైపాస్ లో వెల్డర్ ఉరివేసుకొని ఆత్మహత్య

నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ బైపాస్ లోని రిలయన్స్ పెట్రోల్ బంక్ ఎదురుగా మారుతిరావుకి చెందిన రేకులషెడ్డులో వెల్డింగ్ వర్కర్ పల్లా రామకృష్ణ అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

కొన్నేళ్ళ క్రితం ఆంద్రా ప్రాంతం నుండి వచ్చిన అతను మిర్యాలగూడ పట్టణంలో వర్క్ షాప్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నట్లు అతని బావ గొళ్ళగాని రాజు తెలిపారు.

కాల్వపల్లి గ్రామానికి చెందిన అమ్మాయితో పెళ్ళి అయినట్లు,ఇద్దరు పిల్లలు ఉన్నారని,గత 7 సంవత్సరాల క్రిత బార్యతో విడాకులు అయినట్లు తెలిపారు.అప్పటి నుండి తన తల్లితో కలిసి ఉంటున్న రామకృష్ణ,సంవత్సరం క్రితం అతని తల్లి కూడా కరోనాతో మరణించింది.

అప్పటినుండి నుండి ఒంటరిగా ఉంటున్న రామకృష్ణ,ఈ రోజు ఉరివేసుకోవడం జరిగిందన్నారు.ఇతను గతంలో మర్డర్ కేసులో ఉన్నట్లు సమాచారం.

ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు.గతంలో కూడా ఇదే రేకులషెడ్డులోని రూమ్ లో ఓ ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.

Advertisement
జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకొని బలి చేశారు.. రోజా షాకింగ్ కామెంట్స్!

తాజా వార్తలు