ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళా( Maha Kumbh Mela ) ఈసారి మరింత వైభవంగా ప్రారంభమైంది.తొలిరోజే రికార్డు స్థాయిలో 1.65 కోట్లకు పైగా భక్తులు తరలిరావడంతో ఈ ఆధ్యాత్మిక సమ్మేళనం వరల్డ్ వైడ్గా అందరి దృష్టిని ఆకర్షించింది.నాగ సాధువులు, బాబాలు, ఆధ్యాత్మిక గురువులతో కళకళలాడే ఈ కుంభమేళాలో ఈసారి మాత్రం ఒక కొత్త వ్యక్తి అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నారు.
ఆయనే ఐఐటీయన్ బాబా.( IITian Baba )
అభయ్ సింగ్ ఇప్పుడు మసాని గోరఖ్గా( Masani Gorakh ) తన పేరు మార్చుకున్నారు.జిగేల్ మనే కళ్లతో, ప్రశాంతమైన చిరునవ్వుతో కనిపించే ఈ యువకుడు తన జీవిత ప్రయాణాన్ని మీడియాతో పంచుకున్నారు.దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ బాంబేలో( IIT Bombay ) ఏరోస్పేస్ ఇంజనీరింగ్( Aerospace Engineering ) చదివిన అభయ్ ఏదో వెలితిగా భావించారు.
అందుకే ఆయన తన డిజైరబుల్ కెరీర్ను సింపుల్గా వదిలేసారు.
ఏరోస్పేస్ రంగం నుంచి బయటకు వచ్చాక అభయ్ అనేక వృత్తులను ప్రయత్నించారు.డిజైన్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు, ఫోటోగ్రాఫర్గా అవతారమెత్తారు, విద్యార్థులకు ఫిజిక్స్ కోచింగ్ కూడా ఇచ్చారు.ఈ ప్రయాణంలోనే తత్వశాస్త్రంపై ఆసక్తి పెంచుకొని, పోస్ట్-మోడర్నిజం, సాక్రటీస్, ప్లేటో వంటి అంశాలను అధ్యయనం చేశారు.
ఇవన్నీ ఆయనలో జీవితం, ఆధ్యాత్మికత పట్ల మరింత జిజ్ఞాసను రేకెత్తించాయి.చివరికి, తనను తాను తెలుసుకోవడానికి, శివుడికి అంకితం కావాలని నిర్ణయించుకున్నారు.
అభయ్ సింగ్ తన పేరును మసాని గోరఖ్గా మార్చుకున్నారు.ఆయన రాఘవ్, జగదీష్ అనే పేర్లతో కూడా ఫేమస్ అయ్యారు.ప్రస్తుతం సన్యాసి జీవితాన్ని గడుపుతూ, ఆధ్యాత్మిక వృద్ధి, మానసిక శ్రేయస్సుపై దృష్టి పెట్టారు.“ఇదే నిజమైన జ్ఞానం” అని ఆయన స్పష్టం చేశారు.సమాజం తన గురించి ఏమనుకుంటుందో తాను పట్టించుకోనని తేల్చి చెప్పారు.
అభయ్ సింగ్ కథ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
భౌతిక విజయం కంటే జ్ఞానాన్ని ఎంచుకున్న ఈ ఐఐటీయన్ నిర్ణయాన్ని చాలామంది ప్రశంసిస్తున్నారు.శాంతిని, సత్యాన్ని కనుగొనడానికి ఆయన ఒక జీవనోపాధి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ సంవత్సరం మహా కుంభమేళాకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే ఈ కుంభమేళాలో ఖగోళ గ్రహాల కలయిక 144 ఏళ్ల తర్వాత సంభవిస్తోందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించడంతో ఈ ఆధ్యాత్మిక వేడుక అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.