బ్రేకింగ్ : ఢిల్లీలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న నటి కుష్బూ !

తమిళనాడు రాజకీయాల్లో పలు కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా రాజకీయ హాట్ హాట్ గా సాగుతుంది.

వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.ముఖ్యంగా బీజేపీ ఈసారి ఎలాగైనా తమిళనాడులో జెండా పాతాలనే లక్ష్యంతోనే అడుగులు ముందుకు వేస్తుంది.

ఇదిలా ఉంటే , ఈ నేపథ్యంలో తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తాకింది.కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి కుష్బూ తన పదవికి రాజీనామా చేశారు.

పార్టీకి కూడా రాజీనామా చేసిన కుష్బూ.నేడు బీజేపీలో చేరారు.

Advertisement

ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆమె కాషాయం కండువాను కప్పుకున్నారు.ఢిల్లీలో జరిగిన చేరిక కార్యక్రమంలో కుష్బూకు పార్టీ అభ్యర్థిత్వాన్ని సంబిత్ పాత్రా అందించారు.

గత ఆరేళ్ల కాలం నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఖుష్భు ఈ రోజు ఆ పార్టీకి రాజీనామా చేశారు.ఏఐసీసీ ప్రతినిధి హోదా నుంచి ఖష్బూను తప్పించడంతో ఆమె ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేసింది.

కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నత స్థాయిలో ఉన్న కొందరు .గ్రౌండ్ రియాల్టీ తెలియకుండానే ఆదేశాలు ఇస్తున్నారని, ఇది నచ్చకనే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు తన రాజీనామా లేఖలో పొందుపరిచారు.2014 నుంచి ఖుష్బూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.ఇకపోతే వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఖుష్బూ పోటీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ కి మద్దతుగా రామ్ చరణ్..!!
Advertisement

తాజా వార్తలు