టీఅర్ఎస్ కు ముందస్తు ధీమా ! అందుకేనా కారు స్పీడ్ పెరిగింది

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజయం పై ధీమా పెరిగిపోయింది.ఎన్నికలు ఎప్పడొచ్చినా ఎదుర్కోవడమే కాదు ఖచ్చితంగా విజయం సాధించి తీరుతామని సేపదం కూడా చేసేస్తున్నాడు.

దీనికి తోడు సర్వే లెక్కలు కూడా టీఆర్ఎస్ విజయం ఖాయమని తేల్చేసాయని కేసీఆర్ చెప్తున్నాడు.పనిలోపనిగా ఏపీ పై కూడా తనదైన శైలిలో విమర్శల బాణాలు వదిలాడు.

దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ అనేక ఆసక్తికర అంశాలను కూడా చర్చకు తీసుకొచ్చారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100 స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేసారు.నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.

Advertisement

ప్రధానమంత్రితో అంతకు ముందే సమావేశం అయ్యారు.ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆయన ముందస్తు కసరత్తులో మునిగిపోయారు.

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆక్టోబర్ డెడ్‌లైన్ అధికారులకు విధించారు.కేసీఆర్ ఢిల్లీ టూర్ తరువాత ఆయన లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి.

ఆయన చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.బహుశా మోదీ నుంచి ముందస్తు ఎన్నికలకు సంబంధించిన సమాచారం అందుకున్నారేమో అనే అనుమానం అందరూ వ్యక్తం చేస్తున్నారు.

కేసీఆర్ కూడా ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత బహిరంగంగా మాట్లాడిన తొలి సమావేశంలోనే ముందస్తు సూచనలు ఇచ్చారు.అదేవిధంగా కాంగ్రెస్‌కు సవాల్ చేశారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?

దీనికి కాంగ్రెస్ నేతలు కూడా ప్రతి సవాల్ విసిరారు.మీకు దమ్ముంటే.

Advertisement

ఈ రోజే అసెంబ్లీని బర్తరఫ్ చేసి ఎన్నికలకు రావాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ చేశారు.కేసీఆర్ మీద కోమటిరెడ్డి మిగతా కాంగ్రెస్ నేతలందరి కంటే ఎక్కువ ఆగ్రహంతో ఉన్నారు.

ఎందుకంటే.కోమటిరెడ్డి ఎమ్మెల్యే హోదాపై.

కేసీఆర్ రాత్రికి రాత్రే అనర్హతా వేటు వేయించేశారు.కోమటిరెడ్డితో పాటు పొన్నం లాంటి నేతలు కూడా.

ముందస్తుకు సిద్ధమని కేసీఆర్‌కు సవాల్ చేశారు.కేసీఆర్ ముందస్తుగా ఎన్నికలపై కసరత్తు ప్రారంభించేయడమే కాకుండా ప్రతిపక్షాలకు సవాళ్లు విసరడం చూస్తుంటే ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలు రావడం ఖాయంగానే కనిపిస్తోంది.

తాజా వార్తలు