బండ్ల గణేష్ బండారమంతా బయటపడింది

సంచలన నిర్మాత బండ్ల గణేష్ గురించి ఎప్పుడూ సంచలన వార్తలు వింటూనే ఉన్నాం మనం.

బండ్ల ఇంత పెద్ద నిర్మాత అవడానికి కారణం పెద్ద పెద్ద పొలిటీషియన్స్ దగ్గర బినామి కావడం అని కొందరు, బండ్ల అమ్మాయిలని సప్లై చేస్తూ డబ్బు, పరిచయాలు సంపాదించాడని మరికొందరు ఆరోపణలు చేస్తూ ఉంటారు.

వీళ్ళంతా ఒక ఎత్తు అయితే, హీరో సచిన్ జోషి మరొక ఎత్తు.బండ్ల మీద కోర్టు దాకా వెళ్ళినవాడు సచిన్.

ఇన్నీరోజులు బండ్ల తనని మోసం చేసాడు అని చెప్పడమే తప్ప, ఇద్దరి మధ్య ఏం జరిగిందో చెప్పని సచిన్, నిన్న ఓ ప్రెస్ మీట్ బండ్ల బండారాన్ని దాదాపుగా బయటపెట్టేసాడు.సచిన్ జోషి మాటల ప్రకారం చూస్తే, పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ మీద తెరకెక్కిన గోవిందుడు అందరివాడేలే, టెంపర్ లేదా బాద్షా చిత్రాలకు డబ్బు పెట్టింది కేవలం బండ్ల మాత్రమే కాదంట.

ఎన్టీఆర్ తో ఓ సినిమా, చరణ్ తో ఓ సినిమాకి పేరుకి బండ్ల నిర్మాత అయిన డబ్బు పెట్టింది తాను అని, అసలు తానే లేకపోతే బండ్లకి ఎన్టీఆర్ అవకాశం ఇచ్చేవాడే కాదని, తనని ఆర్థిక అవసరాల కోసం వాడుకోని మోసం చేసాడని సచిన్ చెప్పాడు.పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుంటూ బండ్ల ఇలాంటి పనులకి పాల్పడుతున్నాడని, హీరోలందరితో ఎదురుగా ఉన్నప్పుడు బాగా మాట్లాడే బండ్ల, వారు దగ్గరగా లేనప్పుడు మాత్రం అన్ని చెడుమాటలే మాట్లడతాడని, ఇట్లాంటి తోడేలుకి త్వరలో కోర్టు గుణపాఠం చెబుతుందని సచిన్ చెప్పుకొచ్చాడు.

Advertisement

నిజానిజాలు మనకు తెలియవు కాని, బండ్ల గణేష్ మీద మాత్రం చాలామంది నెగెటివ్ అభిప్రాయాన్నే కలిగి ఉన్నారు.మొన్నోసారి ప్రియాంక చోప్రా కజిన్ మీరా చోప్రా, బండ్ల ఇండస్ట్రీలో అమ్మాయిలని సప్లై చేసే బ్రోకర్ అని ఓ అరోపణ చేసిన సంగతి తెలిసిందే.

 తెలుగు దర్శకుల మీద మెగాస్టార్ కు నమ్మకం పోయిందా?
Advertisement

తాజా వార్తలు