ఇదేందయ్యా ఇది ఇది నేను చూడలా : రాఖీని నోటికి కూడా కడతారా...

ప్రస్తుతం కలకలం సృష్టిస్తున్నటువంటి కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు ప్రభుత్వ అధికారులు మరియు వైద్యులు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించిన సంగతి తెలిసిందే.

అయితే ఇటీవలే రాఖీ పౌర్ణమి కావడంతో ఓ యువతి  మాస్క్ తో తన సోదరుడికి రాఖీ కట్టిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే తాజాగా రాఖీ పౌర్ణమి కావడంతో యువతి కరోనా వైరస్ రాకుండా నియంత్రించేందుకు ఉపయోగించే మాస్క్ కి రాఖీ ని అనుసంధానం చేసి తన సోదరుడి మూతికి కట్టింది.దీంతో తన సోదరి రాఖీ కట్టినందుకుగాను ఆ యువకుడు చేతులను శుభ్రం చేసుకునేందుకు ఉపయోగించే శానిటైజర్ లను తన సోదరికి బహుమతిగా ఇచ్చాడు.

అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించేందుకు ఈ సోదరీ సోదరులు చేసిన వినూత్న ప్రయత్నం నెటిజన్లకు బాగా నచ్చింది.దీంతో వెంటనే ఈ విషయాన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ "ఇది వేరే లెవెల్ ప్రేమ మరియు కేరింగ్" అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 మరి కొందరు ఈ విషయం గురించి స్పందిస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను నియంత్రించేందుకు మాస్క్ మరియు శానిటైజర్లు ఎంతగానో ఉపయోగపడతాయని వాటి ఉపయోగం గురించి వినూత్న రీతిలో తెలియజేసినందుకు ఈ సోదరి సోదరులను అభినందిస్తున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా సంవత్సరమంతా ఎన్ని అవాంతరాలు అడ్డంకులు వచ్చినా సరే ఈ రక్షాబంధన్ పండుగ రోజు మాత్రం తన సోదరుడు లేదా సోద రీలు ఎక్కడున్నా ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకున్న వారు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ కారణంగా ఏడాది రక్షాబంధన్ వేడుకలు పెద్దగా అట్టహాసంగా జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

తాజా వార్తలు